హైదరాబాద్, నవంబర్ 23: ఈనెల 19న నామినేషన్ల గడువు ముగిసినప్పటి నుంచి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిద జిల్లాలలో వరుసగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మహబూబాద్ జిల్లాలో వరుసగా నాలుగు బహిరంగసభలు నిర్వహించబోతున్నారు. ఈరోజు మహబుబాబాద్ జిల్లాలో నర్సంపేటలో ఉదయం 11 గంటలకు బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి మహబుబాబాద్ పట్టణంలో సభకు హాజరవుతారు. ఆ తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు మరిపెడ సభలో పాల్గొంటారు. భోజన విరామానంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు జనగామసభలో పాల్గొంటారు. గంటన్నర వ్యవధిలోనే సిఎం కేసీఆర్ వరుసగా 3 బహిరంగసభలు నిర్వహిస్తుండటం విశేషమే. ఈ పర్యటన సందర్భంగా జిల్లాలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.