జమ్మూ కశ్మీర్, నవంబర్ 23: జమ్మూ కశ్మీర్ లోని అనంతనాగ్ సమీపంలో శుక్రవారం ఉదయం భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో భద్రత బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. శ్రీనగర్కు 50 కిలోమీటర్ల దూరంలో బీజబెరా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఎదురుకాల్పుల్లో వొక పౌరునికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. కుద్వని ప్రాంతంలోని భద్రతా సిబ్బంది క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సిబ్బంది కూడా కాల్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని సవిూప ఆస్పత్రికి తరలించారని, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు