బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ : రఘువీరా రెడ్డి

SMTV Desk 2018-11-21 13:09:34  Raghuveerareddy, BJP, CONGRESS, TRS. Janasena

తిరుపతి, నవంబర్ 21: ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ జగన్, పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ, కేసీఆర్‌కు జగన్‌, పవన్‌ ఏజెంట్లు అని బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏ పార్టీకి మద్దతిస్తారో జగన్, పవన్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకే పోటీ చేయలేనివారు.. పార్లమెంట్‌కు పోటీ చేస్తారా? అని పవన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీకి మాత్రం పోటీ చేయడం ఎందుకు? అని అన్నారు. డిసెంబర్ 15 తర్వాత ఏపీలో పొత్తులపై నిర్ణయం ఉండొచ్చు అన్నారు. రాహుల్ ప్రధాని కావాలని ఏపీలో 72% మంది కోరుకుంటున్నారని అన్నారు.