న్యూఢిల్లీ, జూలై 24: రిలయన్స్ జియో మరో శుభవార్తను మన ముందుకు తీసుకొచ్చింది. దేశంలోని 38 వేల కళాశాలలకు ఉచితంగా వైఫై సేవలను అందించేందుకు జియో ఇప్పటికే మానవవనరుల శాఖ(హెచ్ఆర్డీ)కు ఓ ప్రపోజల్ను కూడా పెట్టినట్లు సమాచారం. ఈ విషయంపై ఓ హెచ్ఆర్డీ అధికారి మాట్లాడుతూ... వైఫై సేవలు ఉచితంగా అందిస్తామని రిలయన్స్ జియో చెప్తుండటంతో ప్రాజెక్టు దానికే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అయితే కేంద్రం ఈ ప్రతిపాదనలకు అంగీకరిస్తే జియో ఉచితంగా ఈ కాలేజీలకు వైఫైను ఇవ్వనుంది. ఈ విషయంపై కేంద్రం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.