అర్జున్ కి వ్యతిరేఖంగా కోర్ట్ తీర్పు

SMTV Desk 2018-11-16 14:56:53  Arjun, Shruthi hariharan, mee too, high court

తమిళనాడు, నవంబర్ 16: ప్రముఖ నటుడు అర్జున్ మీ టూ వివాదంలో రోజురోజుకి ఇబ్బందులు పడుతూనే వున్నాడు. అర్జున్.. శృతి హరిహరన్ ల మధ్య మీటు వ్యవహారం రోజు రోజుకు తీవ్రస్థాయికి చేరుకుంటున్నది. ఇద్దరి మధ్య రాజీ చేసేందుకు కన్నడ పెద్దలు ప్రయత్నించినా ఫలించలేదు. తనను కావాలనే మీటు వ్యవహారంలోకి లాగిందని చెప్పి అర్జున్ శృతి హరిహరన్ పై పరువు నష్టం కేసు పెట్టాడు. ఆమె పై ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదైంది.

ఈ వ్యవహారంపై వాదనలు విన్న కోర్టు శృతి హరిహరన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెపై పెట్టిన ఎఫ్.ఐ.ఆర్ ను రద్దు చేయాలని చెప్పడంతో అర్జున్ పై శృతి పై చేయి సాధించినట్టు అయింది. అర్జున్ పై శృతి హరిహరన్ పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అర్జున్ ను పోలీసులు విచారణించారు కూడా.