నవంబర్ 16: గురువారం జరిగిన భరత్ - ఐర్లాండ్ మహిళల టీ-20 ప్రపంచకప్లో భాగంగా భారత ఓపెనర్ మిథాలీ రాజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన రోహిత్ శర్మ(2207)ను మిథాలీ ఇటీవలే దాటేసింది. ఐర్లాండ్తో మ్యాచ్లో అర్ధశతకం చేయడంతో.. పురుషుల అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో ఉన్న కివీస్ ఆటగాడు మార్టిన్ గఫ్తిల్ ( 2271)ను కూడా వెనక్కి నెట్టేసింది. మిథాలీ టీ-20 ఖాతాలో ప్రస్తుతం 2283 పరుగులు ఉన్నాయి.
అయితే అంతర్జాతీయ టీ-20లలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్వుమెన్గా మిథాలీ రాజ్ నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో న్యూజిలాండ్ బ్యాట్స్వుమెన్ సుజీ బేట్స్ 2996 పరుగులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత వెస్టిండీస్ క్రీడాకారిణి టేలర్ (2691), ఇంగ్లాండ్ క్రీడాకారిణి ఎడ్వర్డ్ (2605) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.