బీసీలకు అన్యాయం చేసిన ప్రముఖ పార్టీలు

SMTV Desk 2018-11-15 11:59:12  Telangana elections, Congress, TRS, BC

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్‌, తెరాస పార్టీలు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేసారని బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య ఆరోపిస్తున్నారు. బిఎల్ఎఫ్ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ బీసీలకు టికెట్లు కేటాయించకుండా అన్యాయం చేసినందుకు నిరసనగా ఈ నెల 17వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చారు కూడా.

అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా ఆ ఆరోపణలను ఖండించారు. తమ పార్టీ పోటీ చేయబోతున్న 94 స్థానాలలో 21 స్థానాలను బీసీలకు కేటాయించిందని తెలిపారు.

ఇక తెరాస బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి వొకటి చొప్పున స్థానాలను కేటాయించింది.