గోపీచంద్ మాస్టర్ ప్లాన్

SMTV Desk 2018-11-11 17:09:40  Gopichand, master plan,

మాన్లీ హీరోగా మాస్ ఆడియెన్స్ ను అలరిస్తున్న గోపిచంద్ కు ఈమధ్య అతని సినిమాల ఫలితాలు నిరాశ కలిగిస్తున్నాయి. ఈ ఇయర్ జూలైలో వచ్చిన పంతం సినిమా ఫ్లాప్ అవడంతో గోపిచంద్ స్క్రిప్టుల విషయంలో ఆచి తూచి అడుగులులేస్తున్నాడు. కథల ఎంపికలో తన పంథా మార్చుకున్న గోపిచంద్ ప్రస్తుతం ముగ్గురు దర్శకులకు ఓకే చెప్పారని తెలుస్తుంది. అందులో మొదటి దర్శకుడు సంపత్ నంది అని తెలుస్తుంది.

గోపిచంద్ తో గౌతం నంద సినిమా చేసిన సంపత్ నంది ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే ఆ సినిమా టైంలోనే మరో కథ డిస్కస్ చేశాడట. ఇప్పుడు ఆ కథతోనే ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలుస్తుంది. ఇక సంపత్ నంది తర్వాత శ్రీవాస్ డైరక్షన్ లో గోపిచంద్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. గోపిచంద్ కు లక్ష్యం, లౌఖ్యం హిట్ అందించిన శ్రీవాస్ గోపిచంద్ ఇమేజ్ కు తగిన కథ సిద్ధం చేశాడట.

అంతేకాదు తమిళ దర్శకుడు తిరు కూడా గోపిచంద్ కు ఓ కథ చెప్పాడట. ఆ కథ కూడా నచ్చడంతో అతనికి గోపిచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. చూస్తుంటే 2019 గోపిచంద్ కెరియర్ జోష్ తెచ్చే హిట్లు పడేలా ఉన్నాయి.