మెదక్ లో విజయశాంతి నిలబడుతోందా...?

SMTV Desk 2018-10-31 18:10:28  Vijaya shanti, TRS, Congress

మెదక్, అక్టోబర్ 31: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మెదక్ జిల్లా నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న నాయకులకు సీట్లు ఎలా పంపిణీ చేయాలో, ఎలా సర్ది చెప్పాలో అర్థం కాకా పెద్ద నాయకులు తలలు పట్టుకుంటున్నారు. అయితే విజయశాంతిని పోటీ చేయడం వల్ల వచ్చేదేమీ లేదని, కొత్త సమస్యలు వస్తాయని పార్టీలోని కొందరు అంటున్నారు. అయితే ఆమె కూడా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటాననే అన్నారు. కానీ ఆమెకున్న ఫాలోయింగ్ పనిచేస్తుందని, ఆమె గెలిచే అవకాశాలున్న నియోజకవర్గంపై సర్వే చేసిన తర్వాత ఆమెను బరిలోకి దించాలని పెద్ద నాయకులు కొందరు భావించారట. అందుకే ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తారని పేర్కొంటున్నారు. అక్కడైతే ఆమె గెలిచేందుకు ఎక్కవ అవకాశాలు ఉన్నాయని నాయకులు చెబుతున్నారు.

జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉందని, ఆ పోటీని విజయశాంతి తట్టుకోలేదనే వాదన కూడా పార్టీలో ఉంది. పార్టీకి వొక్క సీటు అదనంగా వచ్చినా ప్రయోజనమే కదా అనే ఉద్దేశంతోనే ఆమెకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు వొకే చేశారని కొందరు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. గతంలో ఆ జిల్లా నుంచి ఆమె లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు అక్కడ ఆమెకు ఫాలోయింగ్ కూడా ఉందని, కొందరు స్థానిక నాయకులు ఆమెకు గట్టి మద్దతునిస్తున్నారంటున్నారు. ఇందులో వొకటి రెండు సామాజికక వర్గాలకు చెందిన నాయకులే ఆమెకు మద్దతిస్తున్నారు.