తిరుమల , అక్టోబర్ 29: హైదరాబాద్లోని మ్యాక్స్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ కోటీ ఇరవై లక్ష రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద ట్రస్టుకు అందించింది.ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్న కంపెనీ డైరెక్టర్ వి.వి.సూర్యనారాయణరాజు భూపతిరాజు పూజల అనంతరం ఈ విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన డీడీని టీటీడీ జెఈఓ శ్రీనివాసరాజుకు అందజేశారు.