ప్రముఖ నిర్మాత శివప్రసాద్ రెడ్డి కన్నుమూత

SMTV Desk 2018-10-27 12:38:44  TFI Producer, Shiva Prasad reddy,

హైదరాబాద్, అక్టోబర్ 27: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కామాక్షి మూవీస్ అధినేత డి. శివ ప్రసాద్ రెడ్డి (62) ఈరోజు ఉదయం చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా గుండెకు సంబందించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

1987లో కామాక్షి మూవీస్ స్థాపించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు శివ ప్రసాద్ రెడ్డి. ముఖ్యంగా నాగార్జునతో కలిసి విక్కీ దాదా, ఆటో డ్రైవర్, సీతారామరాజు, అల్లరి అల్లుడు, నేనున్నాను, కింగ్, కేడి, రగడ, గ్రీకు వీరుడు సినిమాలు నిర్మించారు. నాగ చైతన్య దడ సినిమను ఆయన నిర్మించడం జరిగింది. ఇవే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమా కూడా శివ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో వచ్చింది. శివ ప్రసాద్ రెడ్డి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.