జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 24: సిపిఐ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలం నార్లాపూర్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు పార్టీ సీఆర్పీ కమాండర్ సుకుమతి అలియాస్ రత్న, ఏరియా కమిటీ సభ్యుడు తాటి అడుమ అలియాస్ మహేశ్ను అరెస్టు చేసినట్లు జిల్లా ఓఎస్డీ సురేశ్కుమార్ తెలిపారు. ఇరువురు చత్తీస్ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా వాసులు. జిలెటిన్ స్టిక్స్ కోసం నార్లాపూర్ వచ్చి పట్టుబడ్డట్లుగా సమాచారం.