ఏ ఎన్నిక వచ్చినా గెలుపు టిడిపిదే

SMTV Desk 2018-10-24 14:21:01  ap, cm chandra babu naidu, elections,

అమరావతి, అక్టోబర్ 24: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ద్రుష్టిసారించి, ఈ రోజు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అలాగే తమ పార్టీ అన్ని విధాలా బలోపేతం చేసే దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఏఎన్నిక వచ్చినా గెలుపు టిడిపిదే కావాలని ఆయన చెప్పారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ బాధ్యులు, ఇతర నాయకులతో ఆయన మాట్లాడారు.