కొత్త రికార్డు సృష్టించిన రాహుల్...

SMTV Desk 2018-10-24 11:13:15  pro kabaddi league,telugu taitans,u mumba,rahul choudari, record

హైదరాబాద్ అక్టోబర్ 24: తెలుగు టైటాన్స్ మల్లీ వోటమి పాలయ్యింది.మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ ఆరో సీజన్ లో తెలగు టైటాన్స్ 21-40 తేడాతో యూ ముంబా చేతిలో వోటమిపాలయ్యింది.ఇదవరకు వోడిన మ్యాచ్ లో మరీ ఇంత వ్యత్యాసం కనిపించలేదు.
ఆరంభంలోనే రెండు పాయింట్లతో ముంబైకి ఆధిక్యాన్నందించిన సిద్దార్థ్‌.. 13వ నిమిషంలో సూపర్‌ రైడ్‌తో ముంబాను 13-7తో పైచేయిలో నిలిపాడు. ప్రథమార్ధం అయ్యేసరికి ఆ జట్టు 17-12తో ముందంజలో నిలిచింది. రెండో అర్ధంలో దేశాయ్‌ చెలరేగిపోయాడు. క్రమం తప్పకుండా పాయింట్లు సాధిస్తూ ముంబాను తిరుగులేని స్థితికి తీసుకెళ్లాడు.కాగా ఈ సీజన్లో ఇప్పటిదాకా 83 పాయింట్లు సాధించిన సిద్దార్థ్‌ టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌ వోడినప్పటికీ..

స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి ప్రొ కబడ్డీ లీగ్‌ చరిత్రలోనే 700 పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించినా.. తెలుగు టైటాన్స్‌ను మాత్రం వోటమి నుంచి కాపాడ లేకపోయాడు. ఈ వోటమి తర్వాత కూడా జోన్‌-బిలో 16 పాయింట్లతో తెలుగు జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం.