న్యూఢిల్లీ, అక్టోబర్ 23:ఢిల్లీ హై కోర్టు వచ్చే సోమవారం వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్తానాపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
లంచం స్వీకరించిన ఆరోపణలపై సిబిఐ తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటాన్ని సవాలు చేస్తూ ఆస్తానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆస్తానాపై ప్రారంభించిన నేరసంబంధితచ ర్యలల్లో యధాతథ స్థితిని కొనసాగించాలని సిబిఐని ఆదేశించిన హైకోర్టు ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తుపై స్టే విధించేందుకు నిరాకరించింది.