కర్నూల్, అక్టోబర్ 23: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో స్వైన్ఫ్లూ బారిన పడి ప్రజలు వణికిపోతున్నారు . మంత్రాలయం మండలం తుంగభద్రలో ఈ వ్యాధితో మంగళవారం ఉదయం మరొకరు చనిపోయారు.ఈ వ్యాధి బారిన పడిన 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఈ వ్యాధి విజృంభిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వ్యాధి కి భయ పడుతున్న ప్రజలు తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు.