ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ ప్రజల కోసం

SMTV Desk 2018-10-15 13:44:14  NTR, Kalyan Ram, Titli victims,

‘తిత్లీ’ తుపానుతో అల్లకల్లోకమైపోయిన ఉత్తరాంధ్రకు అగ్ర కథానాయకులు , నందమూరి సోదరులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు ఆర్థిక సాయం అందించారు.తుపాను బాధితుల కోసం తారక్‌ రూ.15లక్షలు, కల్యాణ్‌ రామ్‌ రూ.5 లక్షలు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఈ విషయాన్ని చిత్రసీమ వర్గాలు ట్విటర్‌ ద్వారా వెల్లడించాయి.గతంలో కేరళను వరదలు, వర్షాలు ముంచేసినప్పుడు కూడా తారక్‌, కల్యాణ్ రామ్‌ వారికి సాయం చేసి అండగా నిలిచారు. అప్పట్లో తారక్‌ రూ.25 లక్షలు ఇవ్వగా కల్యాణ్‌రామ్‌ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు.