మందస;తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన పంటలను పరిశేలించేందుకు ఆంద్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడు రోజుల నుండి జిల్లాల్లో పర్యటిస్తున్నారు.ఈ క్రమంలో మందస వెళ్తుండగా హరిపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం టైరు పేలి డివైడర్పై దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పాటు మంత్రి సీటు బెల్టు పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు డివైడర్ను ఢీకొన్న వెంటనే మంత్రి కారు దిగి బయటకు వచ్చారు.తరువాత మరొక కారులో మందస వెళ్ళిపోయారు.సోమిరెడ్డి కి ప్రమాదం జరిగింది అని తెలియగానే తెదేపా నేతలు వొక్కసారిగా ఉలిక్కిపడ్డారు.ఈ మధ్య కాలం లో తెదేపా నేతలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురికావడం వల్ల తెదేపా నాయకులు చాలా ఆందోళనకు గురవుతున్నారు.