హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 ఇంటర్యూలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-2కి సెలక్ట్ అయి పరీక్షల్లో వైట్నర్, డబుల్ బబులింగ్లో చేసిన 267 మందిని కోర్టు తొలగించింది. మిగతావారికి ఇంటర్యూలు నిర్వహించాలని టిఎస్పిఎస్కి ఆదేశించింది. గ్రూప్-2కి మొత్తం 3147 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో 2016 నవంబర్ 11,13 తేదీల్లో గ్రూప్-2కు పరీక్ష జరిగిన విషయం విధితమే. 2016లో 1032 గ్రూప్-2 పోస్టులకు టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో వైట్నర్, జంబ్లింగ్ వినియోగంపై ఆరోపణలు వచ్చిన దృష్ట్యా ఆ పరీక్షల్లో అగ్రస్థానంలోని 5 వేల మంది అభ్యర్థుల