తన పొలిటికల్ ఎంట్రీ పై స్పష్టత ఇచ్చిన గద్దర్ !

SMTV Desk 2018-10-09 11:51:09  Telangana elections, Gaddar, KCR

తెలంగాణ ప్రజలు కోరుకుంటే డిసెంబర్ లో జరగనున్న ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రజాగాయకుడు గద్దర్ చెప్పుకొచ్చారు . కేసీఆర్ పోటీ చేయనున్న గజ్వేల్ స్థానం నుంచే తాను పోటీ చేస్తానని చెప్పారు . ప్రతిపక్ష పార్టీలతో చర్చించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు . తాను ఓటు హక్కున గజ్వేల్ లోనే నమోదు చేసుకున్నానని... అందుకే అక్కడ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నాని చెప్పారు . ఓటు హక్కును వినియోగించడం తనకు జీవితంలో మంచి అనుభూతి అని అన్నారు . ఓటు హక్కు వినియోగంపై ప్రతి ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తానని తెలిపారు .



తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ తో గద్దర్ నిన్న సమావేశమయ్యారు . భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ , డబ్బు ,మీడియా ,మాఫియా మధ్య ఓటు బందీ అయిందని చెప్పారు . ఓటు హక్కును నమోదు చేసుకోవడంతో మీరు భారతీయుడు అయ్యారని రజత్ కుమార్ తనతో అన్నారని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్న హామీ ఏమైందని కేసీఆర్ ను నిలదీశారు . లక్ష ఉద్యోగాలు , రెండు పడకల ఇళ్ళు ఏమయ్యాయని అని కూడా ప్రశ్నించారు . దీని పై ప్రజలే తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పారు .