భార్యని పిల్లల్ని పొట్టనపెట్టుకున్న తాగుబోతు భర్త !!

SMTV Desk 2018-10-06 14:28:44  Nalgonda, causes death

నల్గొండ ,అక్టోబర్ 06: కట్టుకున్న భర్త.. కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సినవాడు , రోజు తాగొచ్చి చిత్ర హింసలు పెదుతు ఉంటె కట్టుకున్న భార్య,కన్న పిల్లలు ఎమ్ కావాలి ? వారికీ మరణమేనా ..? ఇదే సంఘటన ఓ జిల్లాలో చోటు చేసుకుంది . జీవితాంతం తోడుగా నిలుస్తాడనుకునే భార్య రోజు తాగొచ్చి నానా చిత్రహింసలు పెడుతుంటె ,ఒకనాడు భర్త చేష్టలతో విసిగిపోయి భార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకొంది . ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. మరో బాలుడు గల్లంతయ్యాడు. ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతు ఉంది . ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. తిరుమలగిరి మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు మోహన్‌కు స్వాతి(25)తో ఎనిమిదేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి సాత్విక (6), మధునశ్రీ (4), మమంత్‌ కుమార్‌ (3) ముగ్గురు పిల్లలు. కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న మోహన్ పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. పిల్లల చదువు కోసం వారు నాలుగేళ్ల కిందట అనుముల మండలం హాలియాకు వచ్చేశారు. ఈ క్రమంలో మోహన్ మద్యానికి బానిసాయ్యాడు. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతుండేది. రోజులానే శుక్రవారం నాడు కొద పిల్లలను బడికి పంపిన స్వాతి, భోజనం తినిపించి తీసుకొస్తానని చెప్పి ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం వారిని తీసుకుని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు వెళ్లింది. ఇది గమనించిన పక్కింటి ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు వీరి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడు వస్తున్న సంగతి గమనించి స్వాతి కొడుకుని కాలువలోకి తోసి, ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి దూకేసింది. వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్వాతి, సాత్విక, మధునశ్రీలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆడపిల్లలు ఇద్దరూ మృతిచెందగా.. స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం వెతుకున్నారు.