అవసరంలేని ప్రశ్నలు అడగటానికి సిగ్గుగా లేదు?

SMTV Desk 2018-09-16 16:01:42  mohan Lal, Rape case,

కేరళ వరద బాధితులకు సాయం చేసేందుకు ఇటీవల మోహన్‌లాల్‌ వెల్లింగ్టన్‌ ద్వీపానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఓ విలేకరి అత్యాచార ఘటనపై స్పందించాల్సిందిగా మోహన్‌లాల్‌ను కోరారు. దాంతో మోహాన్‌ లాల్‌ అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇలాంటి సమయంలో అవసరంలేని ప్రశ్నలు అడగటానికి సిగ్గుగా లేదు? ఇక్కడ జరుగుతున్న ముఖ్యమైన కార్యక్రమానికి, అత్యాచార ఘటనకు సంబంధం ఏంటి? కేరళలో వరదల కారణంగా విపత్తు కలిగినప్పుడు ఆ నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడగచ్చు కదా. నేను మంచి విషయాల గురించి మాట్లాడుతుంటే మీరు అత్యాచారం గురించి అడుగుతారేంటి? అసలు నేను వచ్చిన పనికి, క్రైస్తవ సన్యాసినులకు ఏమన్నా సంబంధం ఉందా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలోనూ మోహన్‌లాల్‌ పాల్గొనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇటీవల కేరళకు చెందిన ఓ క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.