భారీ మల్టీ స్టారర్ లో శైలజా రెడ్డి.. హీరోయిన్

SMTV Desk 2018-09-15 11:07:08  dhanush, nagarjuna, anu emmanuel, athidhi rao

చెన్నై: తమిళ సూపర్ స్టార్ ధనుష్ స్వ్వేయ దర్శకత్వం లో ఒక సినిమా రాబోతున్దన్న వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నవే అయితే ఈ సినిమాలో అక్కినేని హీరో నాగార్జున నటించనున్నాడనే విషయం టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతుంది, ఇప్పటికే ధనుష్ నాగ్ కి స్క్రిప్ట్ వినిపించాడని కథ నచ్చడం తో కొన్ని మార్పులూ చేర్పులు చేయవలసిందిగా నాగ్ కోరాడని అందుకు ధనుష్ కూడా ఒప్పుకున్నాడని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందన్న విషయం వేచి చూడాలి, ధనుష్ దర్శకత్వ భాద్యతలు నిర్వహించనున్న ఈ సినిమా లో ధనుష్ కూడా నటిస్తాడా లేదా అనేది తెలియాల్సుంది, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయిక పాత్ర కసం అనూ ఇమ్మాన్యూ ల్ ని పరిశీలిస్తున్నట్టుగా, అథిది రావు కూడా సినిమాలో కనిపించనున్నట్టుసమాచారం.