హైదరాబాద్ : చెన్నూరు అసెంబ్లీ టికెట్ వ్యవహారంలో అలకగా ఉన్న చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. సీఎం కేసీఆర్ ను కలిసిన తర్వాత బాల్క సుమన్ గెలిపిస్తానని మీడియా సమావేశంలో వెల్లడించారు. కేసీఆర్ మాటే తమకు శిరోధార్యమని.. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలకు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. కేసీఆర్తో కలిసి జీవిత కాలం పని చేస్తానని.. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.