హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 15న తెలంగాణకు రానున్నారు. ఈ సందర్భంగా ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ అభ్యర్థులకు, జిల్లా ఇన్ఛార్జీలు, అధ్యక్షులతో సమావేశమై, సూచనలు ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీకి పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని బీజీపీ శ్రేణులు భావిస్తున్నారు. అదే రోజు మహబూబ్ నగర్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. దీనికి తోడు 29న కరీంనగర్ బహిరంగ సభలో పాల్గొంటారు.