నేడు ‘‘తెలంగాణ అమరుల స్మరణ దీక్ష’

SMTV Desk 2018-09-12 11:39:16  Kodnadaram. TJS, Telangana, Telangana amarula smarana deeksha

హైదరాబాద్ : నాంపల్లి లోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తెలంగాణ అమరుల స్మరణ దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. ఏంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఈ దీక్ష చేపట్టనున్నట్లు వివరించారు. అందుబాటులో ఉన్న అమరుల కుటుంబాలను తమ వెంట తీసుకురావాలని ఆయా జిల్లా నేతలకు కోదండరాం సూచించారు. తెరాస ప్రభుత్వం అమరులకు సరైన గుర్తింపు ఇవ్వలేదని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమరుల ఆశయ సాధనకు పెద్ద పీట వేస్తామని అన్నారు. దీక్ష అనంతరం జిల్లా ఇంచార్జి,కన్వీనర్ల సమావేశం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో పొత్తులు,ప్రచార ప్రణాళిక గురించి చర్చిస్తామని అన్నారు.