* మాజీ ఎమ్మెల్యె దేవేందర్గౌడ్ తో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి హైదరాబాద్: రానున్నఅసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం నాయకులూ మమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వివిధ పార్టీల నాయకులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యె దేవేందర్గౌడ్ను ఏఐసీసీ సభ్యుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్) శుక్రవారం ఆయన నివాసంలో కలిశారు. దాదాపు అరగంటసేపు మేడ్చల్ తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది. తాను మేడ్చల్ నుండి కాంగ్రెస్ తరపున పోటి చేస్తున్నానని. పొత్తులో భాగంగా టిడిపి తనకు పూర్తిస్థాయి మద్దతివ్వాలని కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి దేవేందర్గౌడ్ను కోరినట్లు తెలిసింది. తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీ కలిసి ఫొటీ చేస్తాయన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి కలయిక చర్చనీయాంశమైంది.