దమ్ముంటే ముందస్తుకు రా

SMTV Desk 2018-09-07 18:56:15  YCP Challenged Chandrababu, CM TDP

* చంద్రబాబుకు వైసీపీ సవాల్ అమరావతి : దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని చంద్రబాబుకు వైసీపీ నాయకులు బహిరంగ సవాల్ విసిరారు. అధికారం కోసం వెన్నుపోటు పొడిచి రాజకీయాలంటే అపహాస్యం చేసిన ఘనత మీది. మీరు ఎప్పుడైనా న్యాయంగా పోటీ చేసి గెలిచారా అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని 1999లో గెలిచారు. 2009లో మహాకూటమి అంటూ టీఆర్ఎస్ తోనే పొత్తు పెట్టుకున్నారు. 2014లో బీజేపీ, ‘జనసేన’తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ముందు 22 మంది ఫిరాయింపుదారులపై వేటు వేయండి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మంత్రి వర్గంలో ఉన్న నలుగురిని డిస్మిస్ చేయండి. ఫిరాయింపుదారులపై వేటు వేసిన మర్నాడే అసెంబ్లీకి వస్తాం’ అని వైసీపీ పేర్కొంది. తెరాస వస్తున్నట్టు దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని అన్నారు. అప్పడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుస్తుందని సవాల్ విసిరారు.