హైదరాబాద్ : ఐదేళ్ల పాలన పూర్తి కాకుండా తెరాస ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వళ్ళ ప్రజాధనం వృధా అవడం తప్ప ఎటువంటి లాభం లేదని రాపోలు భాస్కర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తుగా ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని. కేబినెట్ నిర్ణయం, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం.. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ చర్యలుగా ఉన్నాయని వారు ఈ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిగే అవకాశముంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో హై కోర్టులో ఈ పిటిషన్ వేయడం పట్ల ఆసక్తి నెలకొంది. ఈ సస్పెన్సు వీడాలంటే మంగళవారం వరకు ఆగాల్సిందే.