కేసీఆర్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు

SMTV Desk 2018-09-07 15:25:35  V. Hanumantarao. Congress Party,

* గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదు. వి.హనుమంతరావు హైదరాబాదు: అసెంబ్లీ రద్దు తర్వాత కేసీఆర్ మాట్లాడిన తీరుని అన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. రాహుల్ గాంధీ దేశంలోనే అతి పెద్ద బఫూన్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు తీవ్ర ఆగ్రహాన్నితెప్పిస్తున్నాయి . ఈ సంధర్బంగా హైదరాబాద్ లో మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గాంధీ కుటుంబం చెప్పుకు కూడా కేసీఆర్ సరిపోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని... తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని వీహెచ్ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని... ప్రతి జిల్లాలో బీసీలకు మూడు సీట్లను కేటాయించాలని ఆయన కోరారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని... ఇదే సమయంలో కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మొదటి లిస్టులో ఎంత మంది పేర్లు ఖరారు చేయాలి. పొత్తులపై ఏ ఏ రాజకీయ పార్టీలతో సంప్రదించాలనే విషయంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది.