* తెరాసలోకి వెళ్లనున్న మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి హైదరాబాద్: అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తెరాసలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. సురేష్ రెడ్డి గతంలో బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు . 2004-09 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్గా సేవలందించారు. 1984లో మండల స్థాయి లీడర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేశ్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా తెరాస ఇప్పటికే బాల్కొండ అభ్యర్థిని ప్రకటించింది.