అసెంబ్లీని రద్దు చేయడంపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పైన బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డిలు గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ అప్రజాస్వామికంగా రద్దు చేశారని బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. ఎంఐఎం ఒత్తిడి వల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీఆర్ఎస్ బొమ్మాబొరుసు లాంటివిని దుయ్యబట్టారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకో చెప్పాలని అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎంఐఎం మీకు మిత్రపక్షమైతే బహిరంగంగా పొత్తుపెట్టుకోవాలని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి చెప్పారు.