యువనేస్తం అక్టోబర్ 2న ప్రారంభం

SMTV Desk 2018-09-05 17:59:24  AP CM Chandrababunaidu, Yuvanesatm, Amaravati

యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దు. పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందాం అమరావతి: యువనేస్తం (నిరుద్యోగ భృతి) పథకాన్ని అక్టోబర్ 2న ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 300 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమరావతిలో ఈరోజు జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు చెందిన బిల్లులను నాలుగు రోజుల్లో క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వని బీజేపీకి అమరావతి బాండ్లపై మాట్లాడే అర్హత లేదని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలనుద్దేశించి అయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు రానప్పుడు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం రెండంకెల వృద్ధిని సాధించింది ఏపీ మాత్రమేనని ముఖ్యమంత్రి తెలిపారు. అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమాతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని ధీమా వ్యక్తం చేసారు.