ముందస్తుకు సిద్ధమవుతున్న టీ కాంగ్రెస్

SMTV Desk 2018-09-05 15:47:59  T Congress, Uttamkumar Reddy, manifesto

* మేనిఫెస్టోలోని అంశాలు ప్రకటించిన పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ :తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న తరుణంలో ... టీకాంగ్రెస్ కూడా అందుకు సిద్ధమవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఈరోజు భేటీ అయింది. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన ఈ కమిటీ... ఈరోజు మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలను ఖరారు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేం చేయబోతున్నామో స్పష్టతనిచ్చింది. సమావేశానంతరం మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వివరాలను వెల్లడించారు. టీ.కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు ఇవే... * ఇంటి స్థలం ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ... ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 6 లక్షలు. * ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ * కల్యాణలక్ష్మి సహా బంగారు తల్లి పథకం పునరుద్ధరణ * అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి ఇప్పుడున్న మొత్తాలు రెట్టింపు * విద్య, వైద్య సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు * 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల ఉచిత ప్రమాద బీమా * గతంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నవారికి ఇప్పుడు అదనంగా రూ. 2 లక్షలు