హరికృష్ణతో సెల్ఫీ, మానవత్వం చనిపోయిందంటూ నెటిజన్ల ఫైర్‌

SMTV Desk 2018-08-31 18:50:47  Harikrishna, Nandamuri Harikirshna selfie,

రెండ్రోజుల క్రితం నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ భౌతికకాయంతో ఆసుపత్రి సిబ్బంది సెల్ఫీ దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆసుపత్రి సిబ్బంది ఆయన భౌతికకాయంతో సెల్ఫీ దిగినట్లుగా తెలుస్తోంది. హరికృష్ణ భౌతికకాయంతో ఇద్దరు డ్యూటీ నర్సులు, వార్డు బాయ్, నార్డు గర్ల్ సెల్ఫీ దిగినట్లుగా తెలుస్తోంది సోషల్‌మీడియాలో షేర్‌ చేసి రాక్షసానందం పొందారు. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎలాంటి సందర్భాల్లో సెల్ఫీలు దిగాలో కూడా తెలియదా అంటూ చివాట్లు పెడుతున్నారు. మానవత్వం చనిపోయిందంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి.