టాలీవుడ్‌లో మ‌రో విషాదం

SMTV Desk 2018-08-31 13:50:45  B Jaya, heart attack, director B Jaya

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. దర్శకురాలు బి.జయ(54) గురువారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. చంటిగాడు సినిమాతో ద‌ర్శ‌కత్వం వైపు అడుగులు వేశారు జ‌య‌. `ప్రేమికులు`, `గుండ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు`, `స‌వాల్‌` చిత్రాల్ని తెర‌కెక్కించారు. ఆమె ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `ల‌వ్‌లీ` మంచి విజ‌యాన్ని అందుకుంది. 2017లో విడుదలైన వైశాఖం ఆమె దర్శకత్వంలో విడుదలైన చివరి చిత్రం. ఆమె భర్త బి.ఎ. రాజుతో కలిసి పలు చిత్రాలనూ నిర్మించారు. దర్శకురాలు, జర్నలిస్ట్‌గానే కాకుండా తాను దర్శకత్వం వహించిన సినిమాలకు తానే ఎడిటింగ్ చేసుకునేవారు జయ. పంజాగుట్ట శ్మశాన వాటికలో జయ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.