హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన చిరంజీవి

SMTV Desk 2018-08-29 18:33:34  ramcharan,chiranjeevi,tollywood,harikrishna,accident

మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మృతి పట్ల ప్రముఖ నటుడు చిరంజీవి మెహిదీపట్నంలోని హరికృష్ణ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. కాగా, చిరంజీవితో పాటు తనయుడు హీరో రామ్ చరణ్ కూడా వచ్చారు . అనంతరం, మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ, తన సోదర సమానుడు, ఎంతో ఆప్యాయంగా పలకరించే వ్యక్తి నందమూరి హరికృష్ణ మరణిoచడంతో దిగ్భ్రాంతికి గురయ్యామని, చాలా బాధగా ఉందని, మనసు కలచివేస్తోందని అన్నారు. హరికృష్ణ, తాము ఎప్పుడు కలుసుకున్నఎంతో ఆప్యాయంగా ఆయన పలకరించేవారని, సరదాగా నవ్వించే వారని గుర్తుచేసుకున్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబసభ్యులు మనస్థైర్యం ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.