రేపు హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. శంషాబాద్ దగ్గరగల ఫాంహౌస్లో హరికృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దకుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగిన చోటే హరికృష్ణ అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు ఇప్పటికే హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్తో పాటు త్రివిక్రమ్, జగపతి బాబు, బాలయ్య , చంద్రబాబు, నారా లోకేష్ తదితరులు ఆసుపత్రికి చేరుకున్నారు. అభిమానుల సందర్శనార్దం హరికృష్ణ మృతదేహం ఎక్కడ ఉంచనున్నారు అనేది తెలియాల్సి ఉంది.