ఇటీవల విడుదలైన చిత్రం “గీత గోవిందం” పట్లిక్ టాక్ తో పాటు అత్యదిక వసూళ్ళను రాబట్టిన చిత్రంగా కూడా నిలిచిందని చెప్పవచ్చు.. కాగా విడుదలైన 15 రోజులకే ఈ చిత్రం వంద కోట్ల మార్కను సొంతం చేసుకుంది తాజాగా సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు గారు.. ఈ చిత్రం పై ఇటీవల “సంతోషం ఫిలిం అవార్డు ఫంక్షన్” లో మాట్లాడుతూ తన దైన శైలిలో స్పందించారు.. `20 ఏళ్ల క్రితం నేను-అరవింద్గారు కలసి పెళ్లి సందడి సినిమా తీశాం. మళ్లీ గీత గోవిందం ఆ సినిమాను గుర్తుచేసింది. బుజ్జీ నా సినిమాను కాపీ కొట్టాడు(నవ్వుతూ). ఒక ముద్దు కూడా లేకుండా సినిమా చేయడం అంటే చాలా కష్టం. నిర్మాతల దగ్గర నుంచి చాలా ఒత్తిళ్లు ఉంటాయి. అవి బుజ్జీ కూడా ఫేస్ చేసి ఉంటాడు. రాజీ పడకుండా మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది` అని అన్నారు.