వైసీపీ ఎమ్మెల్యే కోటి విరాళం

SMTV Desk 2018-08-25 16:02:52  YCP MLA, Kerala, Mekapati Gautham reddy

భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన కేరళవాసులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. వరదల దాటికి వందలాది మంది మృతి చెందగా.. అనేక మంది నిరాశ్రయులయ్యారు. కేరళీయుల బాధను అర్థం చేసుకున్న మనసున్న మనుషులు విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా , కేరళ వరద బాధితులని ఆదుకునేందుకు కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ అధినేత, వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి ముందుకొచ్చారు. తన సంస్థ తరఫున కోటి రూపాయల విరాళాన్ని కేరళ వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. డిమాండ్ డ్రఫ్ట్ రూపంలో నేరుగా కేరళ సీఎం ను కలిసి విరాళం అందజేయనున్నారు. అందుకోసం ఈ నెల 28 లేదా29న గౌతమ్ రెడ్డి కేరళ వెళ్తున్నారు. గౌతమ్ రెడ్డి ప్రస్తుతం ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.