వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రకటించారు. జర్మనీ పర్యటనలో భాగంగా.. బెర్లిన్ డయస్పోరాలో ఇచ్చిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రం హామి ఇచ్చిందని, దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.