దర్శక దిగ్గజం మణిరత్నం సినిమా వస్తుందంటేనే ప్రేక్షకుల్లో ఎప్పుడు చూద్దామా అనే ఒక ఉత్సాహం ఉంటుంది. భారత చిత్ర పరిశ్రమలోని చాలా మంది నటీనటులు మణిరత్నం తో పని చేయాలనే తమ కోరికను తెల్పిన సందర్భాలు చాలానే వున్నాయి తాజాగా తన దర్శకత్వంలో నవాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో చెక్క చివంత వానం (ఎర్రని ఆకాశం తెలుగులో)అనే టైటిల్తో విడుదల కానుంది. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి రావు హైదరి, డయానా ఎరప్పా, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ మల్టీ స్టారర్ గా రూపొందుతుంది. మణి సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకిస్, లైకా ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది . గత కొద్దిరోజులుగా ఇందులోని నటుల పాత్రల తాలూకు పోస్టర్లను రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్, నేడు ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసింది. ట్రైలర్ చూసిన తరువాత సినిమాపై క్రేజ్ మరింత పెరిగిందని అంటున్నారు ప్రేక్షకులు. ట్రైలర్ ని బట్టి చూస్తే అధికార పీఠం కోసం అన్నదమ్ముల కొట్లాట మాదిరిగా కనపడుతోందనేది ఇండస్ట్రీ టాక్ .ప్రతి పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేశారనే విషయం ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానుంది.