తెలంగాణ పర్యటనలో రెండో రోజు కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం 9 గంటలకు బూత్ కమిటీ అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన రాహుల్.. ఆ తర్వాత మీడియా ఎడిటర్లతో భేటీ అయ్యారు. కాసేపటి క్రితం తాజ్కృష్ణలో పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో మొత్తం 245 మంది పారిశ్రామికవేత్తలతో రాహుల్ భేటీ అవుతున్నారు. నారా బ్రాహ్మణి, దగ్గుబాటి సురేష్, టీజీ భరత్ కూడా పాల్గొన్నారు.