హైదరాబాద్, జూలై 17 : ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి త్వరలోనే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రంలో నటించనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడి గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై రామ్చరణ్ నిర్మిస్తున్నారు. కథానాయికగా నయనతారను తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచనలో ఉంది. ఈ సినిమా చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో టైటిల్ను ప్రత్యేకంగా, అందరికి చేరువయ్యేలా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారట. "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" కాకుండా "మహావీర" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా సినిమా పనులు ప్రారంభం కానున్నాయి. చిత్రీకరణ ప్రారంభించిన రోజునే టైటిల్ ను వెల్లడిస్తారో లేదో చూడాలి. కథానాయకులను స్టైల్గా చూపించడంలో సురేందర్రెడ్డి చాలా జాగ్రత్తలు పాటిస్తారు, మరి ఇంతటి చారిత్రాత్మకమైన నేపథ్యం కలిగిన సినిమాలో మన మెగాస్టార్ ను ఏ విధంగా చూపించనున్నారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.