చెన్నై, జూలై 28: మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరుణానిధి ఐదు సార్లు తమిళనాడు రాష్ట్రానికి సిఎంగా బాధ్యతలు నిర్వహించారని, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారన్నారు. ప్రస్తుతం ఆయన కావేరీ ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నారని, కుటుంబసభ్యులు కోరితే అవసరమైన వైద్యసహాయాన్ని అందిస్తామన్నారు. వైద్య సహాయం కోసం ప్రభుత్వానికి ఎటువంటి అభ్యర్థనైనా అందిందా అని అధికారులను ప్రశ్నించగా వారు లేదని చెప్పారు.