ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండేలా

SMTV Desk 2018-07-27 17:06:14  amaravati, andhrapradesh, chandrababu

అమరావతి, జూలై 27 : ఏపీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం కైనేటిక్ గ్రీన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాలు వినియోగించబోతున్నామని చెప్పారు. విశాఖ, అమరావతి, తిరుపతిలో వినియోగానికి చర్యలు చేపడుతున్నామని, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో కైనేటిక్ గ్రీన్‌ కంపెనీకి మంచి పేరుందని అన్నారు. ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండేలా మొబిలిటీ పాలసీ తీసుకొస్తామన్నారు. రాయలసీమ ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మారుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పటికే తిరుపతిలో డిక్సన్‌ కంపెనీ పనులు ప్రారంభించిందని మంత్రి లోకేష్‌ వెల్లడించారు.