బోపాల్, జూలై 17 : మధ్యప్రదేశ్ బోపాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ప్రెస్ కాంప్లెక్స్ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు అగ్నిమాపక శకటాల సాయంతో మంటలను ఆర్పెందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు చుట్టుపక్కల భవనాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో జనం భయాందోళనకు గురయ్యారు. అసలు మంటలు ఎలా వ్యాప్తి చెందాయో తెలియలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.