కత్తి మహేష్ వాల్మీకిగా మారతాడు..

SMTV Desk 2018-07-13 16:46:44  kathi mahesh, swami paripoornananda, cini critic kathi mahesh, hyderabad

హైదరాబాద్, జూలై 13 : కత్తి మహేశ్ బోయవాడిగా మాట్లాడినా.. వాల్మీకిగా మారగలడు అని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. శుక్రవారం (జులై 13) ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. కత్తి మహేశ్‌ను క్షమిస్తున్నట్లు పరిపూర్ణానంద అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యావంతులు కూడా రామనామం గురించి తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మహేష్ కత్తి రాముడి గురించి తెలుసుకుంటాడని.. చట్టాలు కఠినంగా ఉంటే మత సంస్కృతులపై దాడులు జరగవని ఆయన పేర్కొన్నారు. శ్రీరాముడిపై కత్తి మహేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు చేసినందుకు గానూ యాదాద్రి వరకు పాదయాత్ర చేస్తానని పరిపూర్ణానంద స్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వారిద్దరిని ఆరు నెలలపాటు నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు రెండు రోజుల క్రితం నగరాన్ని వదిలివెళ్లారు. అయితే ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న కత్తి మహేశ్.. శ్రీరామునిపై పాట పాడుతూ.. ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే పరిపూర్ణానంద స్వామి కత్తి మహేష్ విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.