ముంబై, జూలై 10 : ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ వివాహం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఓ భోజ్పూరి నటి.. మహాక్షయ్ తనపై అత్యాచారం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనంతటికి ఆయన తల్లి యోగితా బాలీ కూడా సహాయం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో వీరిని వెంటనే అరెస్టు చేయాలని వారం క్రితం ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అయితే జూలై 7న జరగాల్సిన మహాక్షయ్ వివాహం అర్దాంతరంగా ఆగిపోయింది. ఎట్టకేలకు నేడు మహాక్షయ్, నటి మదాలసా శర్మతో అత్యంత సన్నిహితుల మధ్య అతని పెళ్లి జరిగింది. ఊటీలోని మిథున్ చక్రవర్తి హోటల్లో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు సంగీత్ను కూడా నిర్వహించారట. ఇదిలా ఉండగా.. గత నెల బాంబే హైకోర్టు మహాక్షయ్, యోగితా బాలీల బెయిలు దరఖాస్తును తిరస్కరించింది. తరవాత వీరు తాత్కాలిక బెయిలు పొందారు.