ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌ : రాహుల్ 3..రోహిత్ 11

SMTV Desk 2018-07-10 10:52:44  icc t-20 rankings, k.l rahul,, rohith sharma, virat kohli

దుబాయ్, జూలై 20 ‌: టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కే. ఎల్. రాహుల్ టీ-20 ర్యాంకుల్లో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సోమవారం ఐసీసీ టీ-20 ర్యాంకులను విడుదల చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 తొలి మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించిన కేఎల్‌ రాహుల్‌ మూడో స్థానాన్ని దక్కించుకోగా.. ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన నిర్ణయాత్మక టీ-20లో అజేయ శతకం చేసిన రోహిత్‌ శర్మ రెండు స్థానాలను ఎగబాకి 11వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఇక టీమిండియా జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాత్రం ఈసారి నిరాశపరిచాడు. నాలుగు స్థానాలు పడిపోయి 12వ ర్యాంకులో నిలిచాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ మూడు స్థానాలను ఎగబాకి మొదటి ర్యాంకును సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు. జులై 3న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫించ్‌ 172 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. టీ20లో్ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఫించ్‌(156; 63బంతుల్లో 11×4, 14×6) ఇప్పటి వరకూ తన పేరిటే ఉన్న రికార్డును తానే అధిగమించాడు. ఇక జట్టు ర్యాంకుల్లో పాకిస్థాన్‌ అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియాను అధిగమించి భారత్‌ రెండో స్థానానికి ఎగబాకింది.